బషీర్బాగ్, -వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ కళాకారుడు గన్పార్క్ వద్ద నిరసన తెలిపాడు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన నాగార్జున అనే కళాకారుడు ప్లకార్డులతో అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులర్పించి తన ఆవేదనను వెల్లడించాడు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటలు ఆడి, పాటలు పాడి జనాలను ఉత్తేజపరిచామని తెలిపాడు. కానీ తమను మాత్రం రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ పట్టించుకోవడం లేదని వాపోయాడు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని స్వార్థ పూరిత మంత్రిని, రసమయిని వారి పదవుల నుంచి తొలగించాలని, నిజమైన కళాకారులకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.