
టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. శర్వానంద్, అక్కినేని అమల తల్లీకొడుకులుగా నటించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమా రేపు (9న) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖుల కోసం బుధవారం ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు. అయితే ఈ సినిమా చూసిన నాగార్జున థియేటర్ లోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మూవీ చూసిన అనంతరం నాగ్ తన స్పందనను తెలియజేశారు.
సినిమా చూస్తున్నంత సేపు తనకు కన్నీళ్లు ఆగలేదని నాగార్జున చెప్పుకొచ్చారు. తన తల్లి, ఆమె చూపించిన ప్రేమ గుర్తుకొచ్చాయని ఆయన అన్నారు. సినిమా చూసినంత సేపు చాలా భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను చూస్తే ఎవరికైనా ఎడుపొస్తుందని చెప్పారు. 'ఒకే ఒక జీవితం' సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని నాగ్ ఆకాంక్షించారు. కాగా, నాగార్జునతో పాటు అమల, శర్వానంద్, అక్కినేని అఖిల్ తదితరులు ఈ సినిమా ప్రీమియర్ వీక్షించారు.
ఇక ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడీగా రీతూవర్మ నటించగా.. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు.. ఇందులో అమల అక్కినేనితో పాటు నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి ఇతర పాత్రలు పోషించారు. ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
.@iamnagarjuna sir ??❤️#OkeOkaJeevitham from Sep 9th ?@riturv @amalaakkineni1 @twittshrees @prabhu_sr @DreamWarriorpic pic.twitter.com/P0Bk00yEps
— Sharwanand (@ImSharwanand) September 7, 2022