
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నాలుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాల లోకి రుతు పవనాలు వచ్చేసినట్లుహైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిం ది. మరో రెండు రోజుల్లోఆది లాబాద్, కుమ్రంభీం, నిర్మల్, జగిత్యాల జిల్లాల్ లోకి విస్తరిస్తాయని పేర్కొంది. గురువారం నిజామాబా ద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, సిద్ది పేట, నిర్మల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జనగామ తదితర జిల్లాల లో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డాయి. మొత్తం 19 చోట్లమోస్తరు వానలు, 69 చోట్లతేలికపాటి జల్లులు, 99 ప్రాంతా ల్లోఅతి తేలికపాటి జల్లులు కురిశాయి. నిజామాబా ద్ లోని రంజల్ లో 42 మి.మీ., చిన్న మావందిలో 35, నవీపేటలో 31, రంగారెడ్డిజిల్లాలోని అమీర్ పేట్ లో 30.5, ఖమ్మంలోని గంగారంలో 27.5 మి.మీ. చొప్పున వరపాతం రికార్డ్ అయ్యింది.
గతేడాది కంటేముందే.. గతేడాది జూన్ 21వ తేదీన రాష్ట్రాన్నితాకిన రుతుపవనాలు, 22వ తేదీనే పూర్తిగా విస్తరించాయి. అప్పుడు 11 రోజులు ఆలస్యంగా నైరుతి రాగా, ఈ సారి మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ నెల ఒకటో తేదీన కేరళను రుతుపవనాలు తాకాయి. తాజాగా తెలంగాణతోపాటు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మర ఠ్వాడలోని కొన్నిప్రాంతాలు, కర్నాటకలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో మొత్తం ప్రాంతాలు, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళా ఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలోని మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు, అసోం, మేఘాలయలో మరికొన్ని ప్రాంతాల్లోనికి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. కూల్వెదర్.. వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో కూల్ వెదర్ ఏర్పడింది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటి నుంచి వాతావర ణం ఇలాగే ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత తగ్గుతాయని చెప్పింది. గురువారం సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. నల్గొం డలో 34.2 డిగ్రీలు, మెదక్లో 33.2, ఖమ్మంలో 32.4, ఆదిలాబాద్లో 32.3 రామగుండంలో 31.8 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లోశుక్ర, శనివారాల్లోఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శుక్రవారం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.