నల్గొండ, వెలుగు: ప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నల్గొండ జిల్లాకు మరో మంత్రి హోదా దక్కింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మాదిగ సామాజిక వర్గం కోటాలో ప్రభు త్వ విప్ గా క్యాబినెట్ పదవిని దక్కించుకున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియార్టీ వీరేశానికి కలిసొచ్చింది.
రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం నుంచి వీరేశానికి ప్రయార్టీ ఇస్తే నల్గొండ కాంగ్రెస్లో పార్టీకి మైలేజ్ పెరుగుతుందని భావించిన హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మందుల సామేలు సైతం ఒక్కటే సామాజికవర్గం అయినప్పటికీ వీరేశం మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా రెండు సార్లు గెలిచారు.
