- ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి
ట్యాంక్ బండ్, వెలుగు: తలసేమియా బాధిత చిన్నారులకు రక్తదానం చేసేందుకు ప్రతీఒక్కరు ముందుకు రావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద తలసేమియా రన్ నిర్వహించారు.
3కే, 5కే, 10కే రన్ను సిటీ సీపీ సజ్జనార్, మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు బాధితులకు మద్దతుగా నిలిచేందుకు ఈ రన్ నిర్వహించినట్లు తెలిపారు.
