రాయపాటికే నరసరావుపేట ఎంపి సీటు

రాయపాటికే నరసరావుపేట ఎంపి సీటు

నరసారావుపేట లోక్‌సభ అభ్యర్ధిగా సిట్టింగ్‌ ఎంపి రాయపాటి సాంబశివరావు పేరు ఖరారైంది. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పినట్లు రాయపాటి తనయుడు రంగారావు తెలిపారు. నరసరావుపేట అభ్యర్థిపై 3 రోజులుగా అధిష్టానం కసరత్తు చేస్తున్నా ఎంపిక కష్టంగా మారింది. ఈ క్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ పేరు తెర పైకి రావడంతో రాయపాటి అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ నేతలు సుజనా చౌదరి, జనార్ధన్‌, మంత్రులు పుల్లారావు, నారా లోకేష్‌ విడివిడిగా ఆయనతో మాట్లాడి బుజ్జగించారు