ప్రధాని మోడీ.. నిజాలు వినేందుకు ఇష్టపడడం లేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో మీటింగ్లో ఆయనపై మోడీ కోపగించుకున్నారని ఆరోపించారు. ప్రజల సంగతి పక్కనబెడితే ఓ గవర్నర్ నుంచి కూడా మోడీ నిజాలు వినలేరన్నారు. మోడీకి పొగడ్తలు మాత్రమే కావాలన్నారు.
#PMModi अपनी सरकार के अप्पोइंटेड गर्वनर की सच्चाई सुनने को तैयार नहीं:- @asadowaisi #SatyaPalMalik pic.twitter.com/514sxOoUTS
— T Raghavan (@NewsRaghav) January 3, 2022
కాగా, ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం ఎక్కువ అంటూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలపై చర్చించడానికి ఇటీవలే మోడీని కలిశానన్న మాలిక్.. ఆ సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదన్నారు. వివాదాస్పద సాగు చట్టాలపై పోరాడుతున్న రైతుల సమస్యలను మోడీకి నివేదించానన్నారు. కానీ మోడీ సరిగ్గా స్పందించలేదన్నారు. 5 నిమిషాల్లో ఆయనతో తనకు గొడవ అయ్యిందన్నారు. ‘మోడీకి అహంకారం ఎక్కువ. సాగు చట్టాలపై జరుగుతున్న ఉద్యమంలో 500 మంది అన్నదాతలు మృతి చెందారని మోడీకి చెప్పా. దీనికి ఆయన.. వాళ్లు నా కోసం చనిపోయారా’ అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారని సత్యపాల్ పేర్కొన్నారు. మోడీ మాటలు తనను షాక్ కు గురి చేశాయని సత్యపాల్ మాలిక్ అన్నారు.
घमंड...क्रूरता...संवेदनहीनता
— Congress (@INCIndia) January 3, 2022
भाजपा के राज्यपाल के इस बयान में पीएम मोदी के व्यक्तित्व में शामिल इन्हीं 'गुणों' का बखान है।
मगर, ये एक लोकतंत्र के लिए चिंता की बात है। pic.twitter.com/HGxzKfYsme
హర్యానాలోని దాద్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన ఆయన పైకామెంట్లు చేశారు. మాలిక్ కామెంట్స్కు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. గవర్నర్ మాటలతో మోడీ వ్యక్తిత్వం ఏంటో బయటపడిందని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ఇబ్బందికరమని మండిపడింది.