పాలమూరు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై త్వరలో మోడీని కలిసి లేఖను కూడా ఇవ్వనున్నట్లుగా ఆయన చెప్పారు. ప్రధాని మోడీ తెలంగాణ నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తే రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ను ఓడించి తీరుతామని జితేందర్రెడ్డి అన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ... 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్, అదిలాబాద్ నుంచి సోయం బాపూరావు గెలుపొందారు.