ఢిల్లీలో నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ నేషనల్ కాంక్లేవ్

ఢిల్లీలో  నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ నేషనల్ కాంక్లేవ్

ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ నేషనల్ కాంక్లేవ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు తర్వాత ఇదే మొదటి సదస్సు  కాగా రీజినల్ మీడియా న్యూస్ ప్రాధాన్యతలపై సమావేశంలో చర్చించారు. ఫ్యూచర్ న్యూస్ ప్రాధాన్యత, న్యూస్ అంటే ఏంటీ, మార్కెటింగ్, టీఆర్పీ రేటింగ్లపై చర్చించారు. 

నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్లో V6 సహా 40కి పైగా ఛానల్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ ఫాం ద్వారా రీజినల్ మీడియాలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రీజినల్ మీడియాకి నేషనల్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ మంచి ప్లాట్ ఫాంగా ఉంది.