నేషనల్‌‌ ర్యాంకింగ్‌‌ ఆర్చరీ టోర్నీ.. జ్యోతి సురేఖకు గోల్డ్‌.

నేషనల్‌‌ ర్యాంకింగ్‌‌ ఆర్చరీ టోర్నీ.. జ్యోతి సురేఖకు గోల్డ్‌.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్‌‌ ర్యాంకింగ్‌‌ ఆర్చరీ టోర్నమెంట్‌‌లో ఏపీ ఆర్చర్‌‌ వెన్నం జ్యోతి సురేఖ గోల్డ్‌‌ మెడల్‌‌ సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన కాంపౌండ్‌‌ సీనియర్‌‌ విమెన్‌‌ ఫైనల్స్‌‌లో పీఎస్‌‌పీబీ తరఫున బరిలోకి దిగిన  సురేఖ 146 స్కోరుతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించింది. మహారాష్ట్రకు చెందిన అదితి (145) సిల్వర్‌‌, రాజస్తాన్‌‌ ఆర్చర్‌‌ ప్రియా గుర్జార్‌‌ (142) బ్రాంజ్‌‌ నెగ్గారు. ఇక, సీనియర్‌‌ రికర్వ్‌‌ మెన్స్‌‌లో ఏపీకి చెందిన బొమ్మదేవర ధీరజ్‌‌ బ్రాంజ్‌‌ గెలిచాడు. విజేతలకు తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌‌ రంజన్‌‌ మెడల్స్‌‌ అందజేశారు.