- కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ శేఖరప్ప(21) డెడ్బాడీ ఖార్కివ్లోని మార్చురీలో ఉందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. షెల్లింగ్ ఆగిన తర్వాత అతని మృతదేహాన్ని మన దేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ తెలియజేశారని చెప్పారు. పోయినవారంలో ఖార్కివ్లోని ప్రభుత్వ బిల్డింగ్పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప చనిపోయాడు. ‘‘నవీన్ డెడ్బాడీ కుళ్లిపోకుండా ఉక్రెయిన్లోని మార్చురీలో భద్రంగా ఉంచినట్లు జై శంకర్ చెప్పారు. అక్కడ షెల్లింగ్ ఆగిన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకువస్తాము” అని బొమ్మై మంగళవారం విలేకరులకు తెలిపారు.