వర్షాకాలంలో కరెంటు సరఫరాకు ఇబ్బంది కలగొద్దు : నవీన్ మిట్టల్

వర్షాకాలంలో కరెంటు సరఫరాకు ఇబ్బంది కలగొద్దు : నవీన్ మిట్టల్
  • ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం రాష్ట్ర విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం విద్యుత్ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, సీఎం, డిప్యూటీ సీఎంల ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. ముందుగా విద్యుత్ సౌధలో ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్​తోసమీక్ష నిర్వహించారు. 

అనంతరం స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌‌‌‌తో పాటు ఇతర విభాగాలను నవీన్​ మిట్టల్​  సందర్శించారు. ఆ తరువాత మింట్ కాంపౌండ్‌‌‌‌లోని దక్షిణ తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ (టీజీఎస్​పీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో సీఎండీ ముషారఫ్ ఫారూఖీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిస్కం డేటా సెంటర్‌‌‌‌తో సహా ఇతర విభాగాలను పరిశీలించారు. ఈ సమీక్షల సందర్భంగా సీఎండీలు పవర్‌‌‌‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల పనితీరును నవీన్ మిట్టల్ కు వివరించారు.