కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు

కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు

పటియాలా: ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీని వీడే ఉద్దేశం తనకు లేదని ఆ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవ్ జోత్ సింగ్ సిద్ధు అన్నారు. తన పాత గూటైన బీజేపీలో లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధు చేరతారని గత కొద్ది రోజులుగా పుకార్లు వస్తున్నాయి. వీటికి సిద్ధు తాజా వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. ఈ గాసిప్స్ పై సిద్ధు మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వపు పాలసీలను నిర్ణయించేది తాను కాదని, ప్రభుత్వ విధివిధానాలు నచ్చితే ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి విశ్వాస పాత్రుడినన్నారు. బందిపోట్లకు ప్రచారం చేయమన్నందుకే బీజేపీని వీడానని వివరించారు.