చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడింది: ప్రధాని మోది

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడింది: ప్రధాని మోది

చంద్రబాబు చేరికతో ఎన్డీఏ  బలపడిందని ప్రధాని మోదీ అన్నారు.  వికసిత్​ ఆంధ్రప్రదేశ్​ను నిర్మించడమే మా లక్ష్యమన్నారు. వికసిత్​ భారత్​ తో పాటు ఆంధ్రప్రదేశ్​ ను అభివృద్ది చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ఎన్డీఏ పదేళ్ల పాలనలో పేదరికం తగ్గిందన్నారు.  ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఆగ్రహం ఉందని స్పష్టంగా కనపడుతుందన్నారు. 

శ్రీరాముడి గురించి గుర్తుచేసుకుంటే... ఆంధ్ర ప్రజల కళ్ల ముందు నందమూరి తారకరామారావు కనపడతారన్నారు. ఆయన పేదలకు, రైతులకు అందించిన సేవల గురించి గుర్తు చేసుకోవాలన్నారు.  అప్పట్లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్టీ రామారావును ఎలా ఇబ్బంది పెట్టిందో తెలుసుకోవాలన్నారు.  ఎన్టీఆర్​శతాబ్ది ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణాన్ని విడుదల చేశామన్నారు.  అలాగే పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవించిందని ప్రధాని మోదీ అన్నారు.

పేదల కోసం ఎన్డీఏ పనిచేస్తుందని .. ఇది మోదీ గ్యారంటీ అన్నారు. ఆంధ్రప్రదేశ్​ ను గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆంధ్రప్రదేశ్​ యువత సామర్ధ్యాన్ని వెలికితీసేందుకు అనేక చోట్ల కేంద్రం పలు విద్యాసంస్థలను ప్రారంభించిందన్నారు. ఎన్డీఏ హయాంలో ఏపీ ఎడ్యుకేషన్​ హబ్​ గా మారిందన్నారు.  రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు.

ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలను  కలుపుకొని ముందుకు పోతుందన్నారు.  కాని ఇండియా కూటమిలోని పార్టీలను కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేస్తుందన్నారు. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలోని పార్టీలు గొడవ పడుతున్నాయంటే.. ఆ తరువాత ఎలా ఉంటుందో అర్దం  చేసుకోండి అని ప్రధాని అన్నారు.