ఓయూ, వెలుగు: విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్న నీట్ ఎగ్జామ్ను వెంటనే రద్దు చేయాలని దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పీయూబీ శర్మను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
