గోదావరిఖని, వెలుగు: మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలిపై లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన 55 ఏండ్ల వృద్ధురాలు రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 28న చెన్నూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు5ఇంక్లయిన్ చౌరస్తా బస్స్టాప్ వద్దకు వచ్చింది. అశోక్ నగర్కు చెందిన నదీమ్అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి తాను ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళుతున్నానని, అక్కడ దింపుతానని నమ్మబలికి బైక్పై ఎక్కించుకున్నాడు.
2ఏ బ్రిడ్జి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెహికిల్ను తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. వారు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో గాలించగా పోలీసులకు నదీమ్ సెల్ఫోన్ దొరికింది. నిందితుడు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు సమాచారం. దీంతో అతడిపై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
