న్యూఢిల్లీ: నేపాల్ను ఉద్దేశించి ఈ మధ్య ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి మండిపడ్డారు. నేపాల్పై బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దని ఆదిత్యనాథ్కు ఓలి సూచించారు. ‘యూపీ సీఎం ఆదిత్యనాథ్ నేపాల్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు సముచితమైనవి కావు, అలాగే చట్టబద్ధమైనవి కూడా కావు. తాను బాధ్యత వహించని విషయాలపై ఆదిత్యనాథ్ మాట్లాడకుండా ఉండేలా ఆయనను కేంద్ర ప్రభుత్వ నాయకత్వం ఆదేశించాలి. నేపాల్ను బెదిరించే తన వ్యాఖ్యలను ఖండిస్తారని కూడా ఆదిత్యనాథ్కు చెప్పాలి’ అని ఓలి పేర్కొన్నారు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నేపాల్ గురించి ఆదిత్యనాథ్ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సరిహద్దులను నిర్ణయించే విషయంలో టిబెట్ చేసిన తప్పులను నేపాల్ రిపీట్ చేయొద్దన్నారు. తదుపరి పరిణామాల గురించి నేపాల్ ఆలోచించాలని, టిబెట్ విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఇండియా–నేపాల్ దేశాలుగా వేర్వేరు అయినప్పటికీ వాటిలో ఒకే ఆత్మ ఇమిడి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య కల్చర0ల్, హిస్టారికల్, మైథలాజికల్గా అనేక శతాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని, దీనిని నేపాల్ గుర్తుంచుకోవాలని ఆదిత్యనాథ్ చెప్పారు.