సరిగ్గా 16ఏండ్ల కింద భర్త.. ఇప్పుడు ఆమె

సరిగ్గా 16ఏండ్ల కింద భర్త.. ఇప్పుడు ఆమె

ఖాట్మండు: విమాన ప్రమాదంలో కో–పైలట్ అంజు ఖతివాడ చనిపోయారు. సరిగ్గా 16ఏండ్ల కింద ఈమె భర్త దీపక్​ కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ ఆర్మీలో హెలికాప్టర్​ కో పైలట్​గా దీపక్​ పనిచేశారు. తర్వాత అంజును పెండ్లి చేసుకుని యతీ ఎయిర్​లైన్స్​లో జాయిన్ అయ్యాడు. 2006లో నేపాల్​గంజ్ నుంచి జుమ్లా వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో మొత్తం 9మంది మరణించారు.

దీంతో అంజును.. ఆమె తండ్రి ఉన్నత చదువుల కోసం ఇండియాకు పంపించాలనుకున్నారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన భర్తలా పైలట్‌‌ కావాలని అమెరికాలో కోర్సు కంప్లీట్ చేసుకుని ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో యతి ఎయిర్​లైన్స్​లో జాయిన్​ అయ్యింది. అంజుకు 6,396 గంటలు విమానం నడిపించిన అనుభవం ఉంది.