ఖాట్మండు: విమాన ప్రమాదంలో కో–పైలట్ అంజు ఖతివాడ చనిపోయారు. సరిగ్గా 16ఏండ్ల కింద ఈమె భర్త దీపక్ కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ ఆర్మీలో హెలికాప్టర్ కో పైలట్గా దీపక్ పనిచేశారు. తర్వాత అంజును పెండ్లి చేసుకుని యతీ ఎయిర్లైన్స్లో జాయిన్ అయ్యాడు. 2006లో నేపాల్గంజ్ నుంచి జుమ్లా వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో మొత్తం 9మంది మరణించారు.
దీంతో అంజును.. ఆమె తండ్రి ఉన్నత చదువుల కోసం ఇండియాకు పంపించాలనుకున్నారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన భర్తలా పైలట్ కావాలని అమెరికాలో కోర్సు కంప్లీట్ చేసుకుని ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో యతి ఎయిర్లైన్స్లో జాయిన్ అయ్యింది. అంజుకు 6,396 గంటలు విమానం నడిపించిన అనుభవం ఉంది.