కార్పొరేటర్​ V/S ​ఎమ్మెల్యే : అధికార బలంతోనే కూల్చివేయిస్తుండు

కార్పొరేటర్​ V/S ​ఎమ్మెల్యే : అధికార బలంతోనే కూల్చివేయిస్తుండు

కార్పొరేటర్​ V/S ​ఎమ్మెల్యే
అధికార బలంతోనే ఎమ్మెల్యే మైనంపల్లి కూల్చివేయిస్తుండు
నేరేడ్​మెట్ ​డివిజన్​ టీఆర్ఎస్​ కార్పొరేటర్​ శ్రీదేవి ఆరోపణ

నేరెడ్​మెట్, వెలుగు : తమపై కక్షసాధింపుతోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిర్మాణాలు కూల్చి వేయిస్తున్నారని నేరేడ్​మెట్​ టీఆర్​ఎస్​ కార్పొరేటర్ ​శ్రీదేవి ఆరోపించారు. సోమవారం డివిజన్ పరిధిలోని యాప్రాల్​లో టీఆర్​ఎస్​ మాజీ ప్రెసిడెంట్​మధుసూదన్​రెడ్డి ఇంటి మూడో ఫ్లోర్​ను జీహెచ్​ఎంసీ అధికారులు పోలీస్​ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు.  అక్కడికి కార్పొరేటర్​ శ్రీదేవి వెళ్లగా ఆమెను అరెస్ట్​ చేసి జవహర్​ నగర్​ పోలీస్​స్టేషన్​కి తరలించారు.  ఆమె మీడియాతో మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్​ పరిధిలోని అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా నోటీసులు ​ ఇచ్చిన ఒక్క రోజులోనే జీహెచ్​ఎంసీ అధికారులు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అధికార అండతోనే ఎమ్మెల్యే మైనంపల్లి ఇలా చేయిస్తున్నారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

బద్నాం చేస్తే ఊరుకోను .. ఎమ్మెల్యే మైనంపల్లి

మల్కాజిగిరిలోని ఎమ్మెల్యే మైనంపల్లి క్యాంప్​ ఆఫీస్​లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొన్నేండ్లుగా అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నాడనే డివిజన్ ​ప్రెసిడెంట్​గా తొలగించామని పేర్కొన్నారు. పార్టీ పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏమైనా కేసులు ఉంటే కోర్టులకు వెళ్లాలి, కానీ ఇలా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.