కార్పొరేటర్ V/S ఎమ్మెల్యే
అధికార బలంతోనే ఎమ్మెల్యే మైనంపల్లి కూల్చివేయిస్తుండు
నేరేడ్మెట్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి ఆరోపణ
నేరెడ్మెట్, వెలుగు : తమపై కక్షసాధింపుతోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిర్మాణాలు కూల్చి వేయిస్తున్నారని నేరేడ్మెట్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి ఆరోపించారు. సోమవారం డివిజన్ పరిధిలోని యాప్రాల్లో టీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్మధుసూదన్రెడ్డి ఇంటి మూడో ఫ్లోర్ను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. అక్కడికి కార్పొరేటర్ శ్రీదేవి వెళ్లగా ఆమెను అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్స్టేషన్కి తరలించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా నోటీసులు ఇచ్చిన ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ అధికారులు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అధికార అండతోనే ఎమ్మెల్యే మైనంపల్లి ఇలా చేయిస్తున్నారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
బద్నాం చేస్తే ఊరుకోను .. ఎమ్మెల్యే మైనంపల్లి
మల్కాజిగిరిలోని ఎమ్మెల్యే మైనంపల్లి క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొన్నేండ్లుగా అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నాడనే డివిజన్ ప్రెసిడెంట్గా తొలగించామని పేర్కొన్నారు. పార్టీ పేరు అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏమైనా కేసులు ఉంటే కోర్టులకు వెళ్లాలి, కానీ ఇలా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.