
కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కొత్త బార్ల అండ్ రెస్టారెంట్లకు జూన్ 6 వ తేది వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. కొత్తగా 28 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో కొత్తగా బార్ అండ్ రెస్టారెంట్లకు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 28 బార్ అండ్ రెస్టారెంట్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో అప్లికేషన్కు ఫీజు రూ. లక్ష రూపాయిలు చెల్లించాలని... ఈ ఫీజు తిరిగి ఇవ్వబడదని తెలిపింది.
ఈ మధ్యనే తెలంగాణ రూరల్ ప్రాంతంలో 25 కొత్త బార్లకుఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. మూడు నెలల కాలంలో 53 కొత్త బార్ లకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 14 కోట్ల రూపాయిల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరో 28 బార్ అండ్ రెస్టారెంట్ దరఖాస్తులకు కూడా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. తెలంగాణలో మొత్తం 1176 బార్లు ఉండగా.. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు కొత్త వాటితో కలుపుకొని 1129 ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.