ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ కాంబో రిపీట్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ కాంబో రిపీట్

టాలీవుడ్‌‌లో సక్సెస్‌‌ఫుల్ కాంబినేషన్స్‌‌ను రిపీట్ చేయడం చూస్తూనే ఉంటాం. తాజాగా మరో క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. ‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య సూపర్ సక్సెస్‌‌ను అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీళ్లిద్దరి కాంబోతో శుక్రవారం  కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే ‘బేబీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్​ .. దీనికి కథ, స్ర్కీన్‌‌ప్లే, మాటలు అందిస్తూ ఎస్‌‌కేఎన్‌‌తో  కలిసి నిర్మిస్తున్నాడు.  

రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్‌‌కు తీసుకెళ్లి, వచ్చే సమ్మర్‌‌‌‌లో రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.