మంత్రుల కోసం : రాజ్ భవన్ లో 10 ఇన్నోవా క్రిస్టా వాహనాలు

మంత్రుల కోసం : రాజ్ భవన్ లో 10 ఇన్నోవా క్రిస్టా వాహనాలు

రాష్ట్రమంత్రి వర్గ విస్తరణలో భాగంగా పది మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రులకు సంబంధించిన కొత్త వాహనాలు రాజ్ భవన్ లో సిద్ధంగా ఉంచారు. పది ఇన్నోవా క్రిస్టో కార్లను రాజ్ భవన్ లో ఒకరోజు ముందే సిద్ధం చేసి ఉంచారు. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులను.. అధికారులు తమ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రులు తమకు వీలును బట్టి బాధ్యతలు తీసుకుంటారు.