IndvsNz:భాగ్యనగరంలో క్రికెట్ ఫీవర్..ఉప్పల్ కు చేరుకున్న న్యూజిలాండ్ టీమ్

IndvsNz:భాగ్యనగరంలో క్రికెట్ ఫీవర్..ఉప్పల్ కు చేరుకున్న న్యూజిలాండ్ టీమ్

భాగ్యనగరంలో మరోసారి క్రికెట్ ఫీవర్ మొదలైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. జనవరి 18న భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో కివీస్ టీమ్ హైదరాబాద్కు చేరకుంది. తాజ్ కృష్ణ హోటల్లో బస చేస్తున్న న్యూజిలాండ్ టీమ్...ప్రాక్టీస్ చేసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంది. ఉప్పల్కు చేరుకున్న న్యూజిలాండ్ క్రికెట్ సభ్యులను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జనవరి 18న ఉప్పల్లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇందు కోసం టీమిండియా సోమవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనుంది. అటు ఫస్ట్ వన్డేకు సంబంధించి  హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి.  ఆన్ లైన్లో విడుదల చేసిన కొద్దిసేపటికే మ్యాచ్ టికెట్లు అయిపోయాయి. టికెట్లను ఆన్ లైన్లో కొనుగోలు చేసిన వారంతా.. ఎల్బీ సీడియం, గచ్చిబౌలి స్టేడియంలలో  టికెట్లను తీసుకోవాలని HCA తెలిపింది.  టీమిండియా, కివీస్తో మధ్య  మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.