తెలంగాణలో మరో 2,278 కరోనా కేసులు

తెలంగాణలో మరో 2,278 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,278 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,54,880 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 950కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,458 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,21,925గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,005 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 25,050 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో 62,234 టెస్టులు చేయడంతో.. మొత్తం టెస్టుల సంఖ్య 20,78,695కు చేరింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డి 184, మేడ్చల్ 150, నల్గొండ 126, కరీంనగర్ 121, ఖమ్మం 98, వరంగల్ అర్బన్ 91, నిజామాబాద్ 89, సిద్ధిపేట్ 89, సూర్యపేట్ 82, భద్రాద్రి 80, మహబూబా బాద్ 76, సంగారెడ్డి 62, కామారెడ్డి 78 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

పెరుగుతున్న స్మార్ట్‌‌ డివైజ్‌ల వాడకం

గొడవలొద్దు.. బార్డర్‌‌‌‌లో టెన్షన్స్ తగ్గించుకుందాం

రాష్ట్రాలు సెంటర్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ పాటించాల్సిందే