తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 997 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,55,663 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,397కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,222 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,37,172గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,094 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 14,466 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 42,163 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 48,12,167 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 92.76 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 169, మేడ్చల్ 85, రంగారెడ్డి 66, భద్రాద్రి 65, కరీంనగర్ 49, నల్గొండ 46, ఖమ్మం 44, వరంగల్ అర్బన్ 44 కేసులు నమోదైనట్లు రోగ్యశాఖ తెలిపింది.

For More News..

నాకు కరోనా రాలేదు.. కిట్ లోపం వల్లే పాజిటివ్

కరోనా సోకిందని భార్యాభర్తల సూసైడ్

ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీస్