లక్షలు దోచేస్తున్నారు.. నైజీరియన్ల ఉచ్చులో పడుతున్న పెళ్లి కాని యువతులు

లక్షలు దోచేస్తున్నారు.. నైజీరియన్ల ఉచ్చులో పడుతున్న పెళ్లి కాని యువతులు

పెళ్లికానీ అమ్మాయిలే టార్గెట్ గా భారత్ మ్యాట్రిమోని పేరుతో మోసం చేస్తున్న నైజీరియన్ ఆట కట్టించారు నార్త్ జోన్ పోలీసులు.1025 కేసుల్లో నిందితుడిగా ఉన్న నైజీరియన్ అలెక్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 12 కేసులను ఛేదించినట్లు తెలిపారు డీసీపీ చందనా దీప్తి. 

Also Read :- ఎయిర్ పోర్టులో ఫారిన్ కరెన్సీ పట్టివేత

చదువు కోసం ఇండియాకు వచ్చి అక్రమాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.  వీసా గడువు ముగిసిపోయినా అక్రమంగా ఇండియాలో ఉంటూ.. అమ్మాయిలకు పెళ్లి సంబంధాల పేరుతో వల వేశాడని వెల్లడించారు. ఓ యవతి  ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు డీసీపీ. పెళ్లి సంబంధం పేరుతో అలెక్స్ యువతి నుంచి రూ. 14 లక్షల వసూలు చేశాడని వివరించారు.