డగ్స్ కేసు: లిస్ట్ లో ఎనిమిది మంది పేర్లు మిస్

డగ్స్ కేసు: లిస్ట్ లో ఎనిమిది మంది పేర్లు మిస్

ర్యాడిసన్ బ్లూ హోటల్ ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 142 మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు లిస్ట్ విడుదల చేశారు పోలీసులు. లిస్ట్ లో రాహుల్ సిప్లిగంజ్, గల్లా సిద్ధార్థ్ తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అయితే నాగబాబు కూతురు కొణిదెల నిహారిక పేరు లిస్ట్ లో లేదు. నిహారిక ఈవెంట్ లో పాల్గొన్నది నిజమే అని నాగబాబు కాసేపటి క్రితమే వీడియో రిలీజ్ చేశారు. మొత్తం 150మంది ఈవెంట్ లో పాల్గొన్నారని చెప్పారు పోలీసులు. లిస్టులో మాత్రం 142మంది పేర్లను మాత్రమే చేర్చారు. పోలీసులు విడుదల చేసిన లిస్ట్ లో ఇంకా 8మంది పేర్లు మిస్ అయ్యాయి. ఆ ఎనిమిది మంది ఎవరనేది చర్చనీయాంశం అయింది.  పోలీసులు కావాలనే కొందరు ప్రముఖుల పిల్లల పేర్లను లిస్ట్ నుంచి తప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.