అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..9 మంది మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..9 మంది మృతి

ఓహియో: అమెరికా మరోసారి దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓహియో, డేటాస్‌ లోని ఓ బార్‌ దగ్గర జరిగిన కాల్పుల్లో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. కాల్పుల శబ్ధం రావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని.. దుండగుడిని మట్టుబెట్టినట్టు తెలిపారు పోలీసులు. గాయపడిన వారిని స్థానిక హస్పిటల్ కు ఆస్పత్రులకు తలించామన్నారు.

ఈ ఘటనకు కొన్ని గంటల ముందే టెక్సాస్‌ లోని వాల్‌ మార్ట్‌ లో జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక రోజు వ్యవధిలోనే అమెరికాలో రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారు.