కొండచరియలు విరిగి పడి 9 మంది మృతి

కొండచరియలు విరిగి పడి 9 మంది మృతి

చండీగఢ్: కొండచరియలు విరిగి పడటంతో తొమ్మిది మంది చనిపోయిన ఘటన హరియాణాలో జరిగింది. హరియాణా, కిన్నావుర్ జిల్లాలోని సంగ్లా, చిత్కుల్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్కులా నుంచి సంగ్లాకు వెళ్తున్న టెంపోపై బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో టెంపోలో ఉన్న 11 మందితోపాటు డ్రైవర్‌‌కు, రోడ్డు మీద వెళ్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన బ్రిడ్జితోపాటు సమీపంలోని ఇళ్లు కూడా పాడయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న కిన్నావుర్ పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.