- రిటైల్ ప్రి-ప్యాక్ లపై జీఎస్టీ
- కేసినోలపై జీఎస్టీ విధింపుపై నిర్ణయం వాయిదా
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు పరిహార సెస్ చెల్లింపును కొనసాగించాలన్న ప్రపోజల్పై చండీగఢ్లో బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కేసినోలు, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఎంఓ) ప్రపోజల్స్పై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశాలపై జులై 15 వరకు తన జీఎంఓ తాజా రిపోర్టును ఇస్తుంది. బ్రాండెడ్ కాని కొన్ని ఆహార పదార్థాలు, ధాన్యాలు మొదలైన వాటిపై ఇక నుంచి జీఎస్టీని మినహాయిస్తారు. పెరుగు, లస్సీ, వెన్న, పాలతో ప్రీ-ప్యాక్ చేసిన, ప్రి- లేబుల్ చేసిన ప్యాక్లపై పన్ను విధిస్తారు. కొత్త రేట్లు జులై 18 నుంచి అమల్లోకి వస్తాయి. చెక్కుల జారీకి ( పుస్తక రూపంలో) బ్యాంకులు వసూలు చేసే చార్జీలపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. ఇక నుంచి రూ.వెయ్యిలోపు అద్దె ఉండే హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ వేస్తారు. ఒక రోగి ఆసుపత్రి గదికి (ఐసీయూ మినహా) రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 5 శాతం పన్ను పడుతుంది. అట్లాస్లు, వాల్ మ్యాప్లు, టోపోగ్రాఫికల్ ప్లాన్లు గ్లోబ్లతో సహా అన్ని రకాల మ్యాప్లు హైడ్రోగ్రాఫిక్ చార్ట్లపై 12 శాతం జీఎస్టీ ఉంటుంది.