హైదరాబాద్, వెలుగు: సీబీఎస్ఈ నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో అండర్-17 విమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ (వాగ్) విభాగంలో సిటీ శివార్లలోని గాడియం స్కూల్ చెందిన నిషా ప్రవీణ్ అగర్వాల్ ఆల్ రౌండ్ వ్యక్తిగత చాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. గాడియం స్కూల్ వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్లో నిషా 42.90 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్తో గోల్డ్ సొంతం చేసుకుంది. హాబిటాట్ స్కూల్కు చెందిన అమనీ దిల్షాద్ (41.80) సిల్వర్, గాడియం స్కూల్కు చెందిన నారాయణి మధుసూదన్ (37.75) సిల్వర్ నెగ్గింది.
కాగా, అండర్-–19 విభాగంలో ఆర్బీటీ విద్యాలయానికి చెందిన కోమల్ ధాకే 37.35 పాయింట్లతో బంగారు పతకం సాధించింది. డీఎస్ పబ్లిక్ స్కూల్కు చెందిన సావర్ణి శర్మ సిల్వర్, అల్వార్ లోని చినార్ స్కూల్కు చెందిన భవ్య జైన్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. టోర్నీ ముంగిపు కార్యక్రమంలో గాడియం మెంటార్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు మెడల్స్, ట్రోఫీలు అందజేశారు.