జిమ్నాస్టిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో నిషాకు గోల్డ్​ మెడల్

 జిమ్నాస్టిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో  నిషాకు గోల్డ్​ మెడల్

హైదరాబాద్, వెలుగు:  సీబీఎస్‌‌‌‌ఈ నేషనల్​ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో అండర్-17 విమెన్స్​ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ (వాగ్) విభాగంలో సిటీ శివార్లలోని గాడియం స్కూల్​ చెందిన నిషా ప్రవీణ్ అగర్వాల్ ఆల్ రౌండ్ వ్యక్తిగత చాంపియన్‌‌‌‌షిప్ టైటిల్‌‌‌‌ను గెలుచుకుంది. గాడియం స్కూల్​ వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్లో నిషా 42.90 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్​తో గోల్డ్​ సొంతం చేసుకుంది. హాబిటాట్ స్కూల్‌‌‌‌కు చెందిన అమనీ దిల్షాద్ (41.80) సిల్వర్, గాడియం స్కూల్‌‌‌‌కు చెందిన నారాయణి మధుసూదన్ (37.75) సిల్వర్​ నెగ్గింది.

కాగా, అండర్‌‌‌‌-–19 విభాగంలో ఆర్‌‌‌‌బీటీ విద్యాలయానికి చెందిన కోమల్‌‌‌‌ ధాకే 37.35 పాయింట్లతో బంగారు పతకం సాధించింది.  డీఎస్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు చెందిన సావర్ణి శర్మ సిల్వర్, అల్వార్‌‌‌‌ లోని చినార్‌‌‌‌ స్కూల్​కు చెందిన భవ్య జైన్‌‌‌‌ బ్రాంజ్​ మెడల్​ కైవసం చేసుకుంది. టోర్నీ ముంగిపు కార్యక్రమంలో గాడియం మెంటార్​, బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపీచంద్​, అథ్లెటిక్స్​ కోచ్​ నాగపురి రమేశ్  ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు మెడల్స్​, ట్రోఫీలు అందజేశారు.