కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమబెంగాల్‭లోని సిలిగురిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజ్ పై ఉండగానే కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్యక్రమాన్ని ఆపివేసి.. సభా వేదిక వద్దకు వైద్యులను పిలిపించారు. కేంద్రమంత్రిని పరీక్షించిన వైద్యులు.. ఆయనకు ప్రాథమిక చికత్స అందించారు. 

అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నితిన్ గడ్కరీని అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ సంబంధింత అధికారులకు ఫోన్ చేసి.. గడ్కరీ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. మరోవైపు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా నితిన్ గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీస్ కమిషనర్‭కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఇక.. సిలిగురిలోని సేవక్ కంటోన్మెం ట్ పరిధిలో.. ఫోర్ లైన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వచ్చారు.