రేవంత్ మీద పోటీ వద్దు.. కామారెడ్డి వైఎస్సార్‌‌‌‌టీపీ నేతకు షర్మిల సూచన

రేవంత్ మీద పోటీ వద్దు.. కామారెడ్డి వైఎస్సార్‌‌‌‌టీపీ నేతకు షర్మిల సూచన

హైదరాబాద్, వెలుగు :  పీసీసీ చీఫ్‌‌ రేవంత్ రెడ్డి మీద పోటీ వద్దని కామారెడ్డి వైఎస్సార్‌‌‌‌టీపీ జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్‌‌‌‌ను ఆ పార్టీ చీఫ్‌‌ షర్మిల కోరారు. ఆయన మీద పోటీ చేయాలని నిర్ణయించుకున్నందున గురువారం సుధాకర్‌‌‌‌ను లోటస్ పాండ్‌‌కు పిలిచి ఆమె మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రేవంత్‌‌పై పోటీ చేయడం కరెక్ట్ కాదన్నారు. షర్మిల సూచనతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ సందర్భంగా సుధాకర్ వెల్లడించారు.