- సీఎస్ నోటి మాటగా మాత్రమే అడిగారు
- దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్
హైదరాబాద్సిటీ, వెలుగు : ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలతో కూడిన డ్రాఫ్ట్ ఏదీ అందలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సీపీఆర్వో శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల రైల్వే జీఎం శ్రీవాత్సవ్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పథకాలపై చర్చించారని, ఇందులో సీఎస్రామకృష్ణారావు ఒక ప్రతిపాదన చేశారన్నారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎంఎంటీఎస్లోనూ ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని కోరారన్నారు. అయితే, దీని పై డిటెయిల్డ్ప్రపోజల్స్, ఎంవోయూతో కూడిన డ్రాఫ్ట్ పంపాలని జీఎం కోరారన్నారు. కానీ, ఇప్పటివరకు ఏమీ రాలేదన్నారు. ఒకవేళ వస్తే రైల్వే బోర్డు దృష్టికి తీసుకుపోతామన్నారు. జూన్2 నుంచి ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

