మోదీ విజయాన్ని ఆపలేరు : కిషన్ రెడ్డి

మోదీ విజయాన్ని ఆపలేరు : కిషన్ రెడ్డి
  •  బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎంత మంది ఒవైసీలు, రాహుల్ గాంధీలు అడ్డొచ్చినా.. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో అద్భుత మెజారిటీతో మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. దేశంలోని యువత అంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2047 వరకు భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రతి ఒక్కరికి అందించడమే దీని లక్ష్యమన్నారు.