టీం ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లకు దక్కని చోటు

టీం ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లకు దక్కని చోటు

టీ20 వరల్డ్ కప్ లో  బెస్ట్ ఫర్ఫామెన్స్  చేసిన ఆటగాళ్లతో కూడిన టీం  ఆఫ్ ది టోర్నమెంట్ ను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ప్రకటించింది.  అయితే ఇందులో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం భారత అభిమానులకు నిరాశే అని చెప్పవచ్చు. కెప్టెన్ కొహ్లీ, రోహిత్ శర్మ కూడా చోటు దక్కలేదు. ఐసీసీ టీం ఆఫ్ ది టోర్న మెంట్ కు పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్ ను కెప్టెన్ గా ప్రకటించింది.  డేవిడ్ వార్నర్  (ఆస్ట్రేలియా) బట్లర్(ఇంగ్లాండ్) ఓపెనర్లు  అసలంక(శ్రీలంక), మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ (దక్షిణాఫ్రికా), హసన్ రంగా(శ్రీలంక), అడమ్ జంపా(ఆస్ట్రేలియా), హజల్  వుడ్ (ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్ (ఆస్ట్రేలియా),  అన్రిచ్ నార్జ్ (దక్షిణాఫ్రికా) లు  బెస్ట్ ఎలెవన్ కాగా పాకిస్తాన్ ప్లేయర్ షహీన్ షా అఫ్రిదిని రిజర్వ్ ప్లేయర్ గా ప్రకటించింది.