పెద్దపల్లికి కొత్త కలెక్టర్ను నియమించని సర్కారు
ఇన్చార్జితోనే నెట్టుకొస్తున్నరు
ముందుకు సాగని పనులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ లేక రెండు నెలలు అవుతోంది. ప్రభుత్వం రెగ్యులర్కలెక్టర్ ను నియమించకపోవడంతో జిల్లాలో పరిపాలన కుంటుపడుతోంది. జూన్15న జిల్లా కలెక్టర్అయిన సిక్తా పట్నాయక్ను ఆదిలాబాద్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న భారతి హోలీ కేరికి పెద్దపల్లికి ఇన్చార్జీగా బాధ్యతలు అప్పగించారు.
ముందుకు సాగని పనులు
ప్రభుత్వం హరితహారం, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, విలేజీ అర్బన్ పార్కుల నిర్మాణం లాంటి కార్యక్రమాలను ప్రాధాన్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఇన్చార్జి కలెక్టర్ పాలనతో ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమాలు కూడా అనుకున్నంత స్పీడ్గా సాగడం లేదు. జిల్లాలో 54 రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించగా ఇందు కోసం రూ. 11.88కోట్లు కేటాయించారు. అయితే అనుకున్నట్టు ఈ పనులు కొనసాగడం లేదు. ఒక్క రైతు వేదికలు మాత్రమే కాకుండ ప్రభుత్వ పరంగా మిగిలిన ప్రాధాన్య కార్యక్రమాలు కూడా ఆలస్యమవుతున్నాయి.
సమస్యలు ఎవరికి చెప్పుకునేది ?
ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ను నేరుగా కలిసి చెప్పుకునే వారు. 2 నెలలుగా కలెక్టర్ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్చార్జి కలెక్టర్ ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు వస్తారో తెలిసే అవకాశం లేదు. పబ్లిక్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికైనా జిల్లాకు కొత్త కలెక్టర్ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.