జేమ్స్ బాండ్ కూడా కరోనా బాధితుడే.!

జేమ్స్ బాండ్ కూడా కరోనా బాధితుడే.!

ప్రపంచం మొత్తం ఇష్టపడే ఫ్రాంచైజీ అది. అందుకే ‘నో టైమ్‌ టు డై’ కోసంఅందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించలేదు. ఈ సినిమా ఇప్పుడు రావడం లేదు. కరోనా దెబ్బకివాయిదా వేయక తప్పలేదు. ప్రపంచమంతటినీ ఈ వైరస్‌‌ ఇబ్బంది పెడుతున్నసమయంలో సినిమాని రిలీజ్ చేయడంమంచిది కాదని భావించిన దర్శక నిర్మాతలు, ఏప్రిల్ ప్రారంభంలో విడుదలకావాల్సిన సినిమాని ఏడు నెలల పాటువాయిదా వేశారు. నవంబర్‌‌‌‌ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.కొంతకాలంగా బాండ్‌ గా కొనసాగుతున్న డ్యానియెల్‌‌ క్రెగ్‌‌కి బాండ్‌ గా ఇది చివరి సినిమా.అలాంటిది ఈ మూవీ ఇంతకాలం పోస్ట్‌‌పోన్ అవడం ఆయన్ని కూడా డిజప్పాయింట్ చేసే విషయమే. కాకపోతే మరీ అంతకాలం వాయిదా వేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . అప్పటి వరకు కరోనా పోదా, పోనీ అప్పటికైనా పోతుందని తెలుసా, లేదంటే ఇంకేవైనా ఇష్యూస్ ఉండి, దీని వంకపెట్టుకుని వాళ్ల సమస్యల్ని కప్పిపుచ్చుకుంటు న్నారా అంటూ రకరకాల డౌట్స్‌‌ వ్యక్తం చేస్తున్నారు జనం. అసలు కారణం వాళ్లకే తెలియాలి మరి!