ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు

ఢిల్లీ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇవాళ్టి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకారానికి ఈ నెల 21వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ నెల 22న స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్లను ఉపసంహణ గడువు ఈ నెల 24వ తేది. ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి.