చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్ కేసు

చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్ కేసు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూల్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికంగా నివసించే సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూల్‌లో ఎన్-440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో కర్నూల్ ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో చంద్రబాబుపై ఐపీసీ 155,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా ప్రకృతివైపరిత్యాల చట్టం కింద కూడా చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఫైల్ చేశారు.