- మెడికల్ పీజీ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్
- కటాఫ్ స్కోర్ తగ్గడంతో దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: నీట్ పీజీ కటాఫ్ స్కోర్ను కేంద్ర ఆరోగ్య శాఖ తగ్గించినందున అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23 ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24 ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
కటాఫ్ స్కోర్ను జనరల్ అభ్యర్థులకు 25 పర్సెంటైల్గా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు15 పర్సెంటైల్గా, దివ్యాంగులకు 20 పర్సెంటైల్గా ఇటీవలే కేంద్రం ప్రకటించింది. వివరాలకు www.knruhs.telangana.gov.inను చూడాలని అధికారులు తెలిపారు.