దీపావళి సెలవుపై గందరగోళం.. ఎన్నికల విధుల్లో లేనోళ్లకే సెలవు.. !

దీపావళి సెలవుపై గందరగోళం.. ఎన్నికల విధుల్లో లేనోళ్లకే సెలవు.. !

హైదరాబాద్, వెలుగు: దీపావళి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎస్ శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఉంది. నెగోషియెబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు ప్రకారం ప్రభుత్వ సెలవు ప్రకటనకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ అడ్డంకిగా మారింది. దీంతో పూర్తి స్థాయి సెలవును ప్రకటించే అవకాశం ప్రభుత్వానికి లేదు. 

అందువల్ల ఆప్షనల్ హాలిడే లేదా ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ సీఈఓకు ప్రభుత్వం లెటర్ రాసింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మినహాయించి, మిగతా వాళ్లకు ఆప్షనల్ హాలీడే ప్రకటించే అవకాశం ఉంది.