కోవిడ్ వార్డ్ బాత్రూంలో సూసైడ్ చేసుకున్న నర్స్

కోవిడ్ వార్డ్ బాత్రూంలో సూసైడ్ చేసుకున్న నర్స్

బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న ఓ నర్స్ కోవిడ్ వార్డులోని బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో జరిగింది. నెల్లూరుకు చెందిన జయమ్మ స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. ఆమెకు గత మే నెలలో కోవిడ్ వచ్చి తగ్గింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బ్లాక్ ఫంగస్ సోకడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బ్లాక్ ఫంగస్ తగ్గదేమోనని భావించిన జయమ్మ.. వార్డులోని బాత్రూంలో ఉదయం 4 గంటలకు ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్స్ సూసైడ్ చేసుకోవడంతో.. తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి స్విమ్స్‌ను పరిశీలించారు. జయమ్మ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు ఆయన తెలిపారు.