
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, కరవుపై ఈ నెల 30 న సమీక్ష నిర్వహించాలని సోమిరెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించి మంత్రి కార్యాలయం నుంచి ఈ నెల 24నే అధికారులకు సమాచారం వెళ్లింది. సమీక్ష కోసం సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు ఎదురు చూసినా.. అధికారులు ఎవరూ రాకపోవడంతో మంత్రి వెళ్లిపోయారు.