న‌దిలో చిక్కుకున్న యువ‌కుల‌ను కాపాడిన అధికారులు

న‌దిలో చిక్కుకున్న యువ‌కుల‌ను కాపాడిన అధికారులు

క‌రీంన‌గ‌ర్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మూసి నదిలో చిక్కుకున్న యువకులను పోలీసులు కాపాడారు. జిల్లాలోని గ‌న్నేరువ‌రం మండ‌లం ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు షబ్బీర్, సోహాల్, కైఫ్..లు కె.టి.అన్నారం వద్ద మూసి నదిలో చిక్కుకోగా.. స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ భాస్కరన్, RDO, పోలీసు సిబ్బంసి, ఫైర్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ముగ్గురిని కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ భాస్క‌ర‌న్ మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసు, అధికారుల భాగస్వామ్యంతో వారిని రీస్క్యూ చేసి కాపాడినట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజలు సహకారం అందించడం అభినందనీయమ‌ని అన్నారు. వర్షాలు బాగా కురుస్తుండడంతో నదులు, వాగులు నీటితో నిండి ప్రవహిస్తున్నందున‌.. చెరువులు అలుగులు పోస్తున్నాయని, ఈ సమయంలో నీటిలోకి వెళ్లడం ప్రమాదకరమ‌ని అన్నారు. కాబట్టి ‌ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు‌.