సొసైటీ బీరువా పగులగొట్టిన ఆఫీసర్లు

సొసైటీ బీరువా పగులగొట్టిన ఆఫీసర్లు

అందులో మినిట్స్  బుక్ లేదని వెల్లడి

ధర్పల్లి, వెలుగు: ఒన్నాజీపేట్‌‌‌‌ సొసైటీ బీరువాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఆఫీసర్లు ఆదివారం పగులగొట్టి తెరిచారు. అందులో ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెన్షన్ గురైన సీఈఓ గంగనర్సయ్య బీరువా తాళాలు, ఫైళ్లు అప్పగించలేదు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దారు ఆనంద్‌‌‌‌ కుమార్, సొసైటీ డైరెక్టర్లు, సర్పంచ్ లు పోలీస్ బందోబస్తు మధ్య సొసైటీ బీరువా తాళం పగులగొట్టారు. సొసైటీ ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. మినిట్స్ బుక్ మాత్రం లేదని వారు వెల్లడించారు. సొసైటీ చైర్మన్‌‌‌‌ రాజేందర్‌‌‌‌రెడ్డి, ఆర్‌‌‌‌ఐ రవి పాల్గొన్నారు.