ఖిలా వరంగల్(మామునూరు) / భద్రాచలం/ టేకులపల్లి, వెలుగు: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి అక్కరూ కృషి చేయాలని ఆఫీసర్లు పిలుపునిచ్చారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో మంగళవారం వరంగల్ జిల్లా గుంటూరుపల్లిలో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని కలెక్టర్ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 'స్నేహ' కార్యక్రమం ప్రారంభిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు.
మహిళలు, కౌమార దశలో ఉన్న చిన్నారుల సంక్షేమానికి స్నేహ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. భద్రాచలం ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి ఆధ్వర్యంలో బాలికా సంరక్షణ ప్రోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్పూనెం కృష్ణదొర మాట్లాడుతూ 14 ఏండ్లపై బడిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. టేకులపల్లి సెక్టార్ సూపర్వైజర్ అనురాధ ఆధ్వర్యంలో పోషక విలువలపై అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో కె.మంగతార పాల్గొని మాట్లాడారు.
