కరోనా ఎఫెక్ట్.. విశాఖ పోర్టులో చైనా షిప్ ను ఆపేసిన అధికారులు

కరోనా ఎఫెక్ట్.. విశాఖ పోర్టులో చైనా షిప్ ను ఆపేసిన అధికారులు

కరోనాతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అయితే విశాఖపట్నం పోర్టుకి గురువారం రాత్రి ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా కార్గో ఫిష్ చేరుకుంది. షిప్ లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 17 మంది చైనా, ఐదుగురు మయన్మార్ కి చెందిన వారున్నారు. అయితే కరోనాతో అలర్ట్ అయిన అధికారులు షిప్ ను పోర్టు కి దూరంగా ఆపేశారు. షిప్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.