మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో ‘ఓజీ టూర్ ఇండియా’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బౌల్డర్ హిల్స్లో జూన్ 13న ఈవెంట్ జరగనుంది. ఈ మ్యూజికల్ ఈవెంట్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ‘‘ఓజీ’ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్లో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది.
అనిరుధ్ గారి ‘హుకుం టూర్’ ఎంతటి ప్రభావాన్ని చూపిందో, మనకు ‘ఓజీ టూర్’ కూడా అంతటి బలాన్ని ఇచ్చింది. ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ సెలబ్రేషన్ను ఒక ఐకాన్గా తీసుకుని ఈ కాన్సర్ట్ను రూపొందించాం. జూన్ 13న హైదరాబాద్ తర్వాత జులై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్లో ఈవెంట్లు నిర్వహించబోతున్నాం.
ఈ నాలుగు నగరాల్లో జరగనున్న టూర్కు హైదరాబాద్ నుంచే గ్రాండ్గా స్టార్ట్ ఇస్తున్నాం. నేను చేసే ప్రతి షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్ను ఎప్పుడూ ఛారిటీకి అందిస్తుంటాను. ఈ షోకు సంబంధించిన వివరాలను కూడా కార్యక్రమం పూర్తైన తర్వాత వెల్లడిస్తాను’ అని చెప్పాడు.
