ఈఎన్సీ జనరల్ గా రమేశ్ బాబు : రాష్ట్ర ప్రభుత్వం

ఈఎన్సీ జనరల్ గా రమేశ్ బాబు : రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈఎన్​సీ జనరల్​ను నియమించింది. జనవరి 31న అంజద్​ హుస్సేన్​ రిటైర్​మెంట్ తో వారం రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఫైల్స్​ ఎక్కడివక్కడ పేరుకుపోతుండడంతో.. తాజాగా ప్రభుత్వం ఓలేటి వెంకటరమేశ్​ బాబుకు ఈఎన్​సీ జనరల్​ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఈఎన్​సీ అడ్మిన్​గా కూడా పనిచేస్తున్న ఆయనకు.. ఈఎన్​సీ జనరల్​గా అదనపు బాధ్యతలను అప్పగించింది. 

ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రమేశ్​ బాబు కూడా మార్చిలో రిటైర్​ కాబోతున్నారు. దాదాపు రెండు నెలలు ఆయన ఈఎన్​సీగా బాధ్యతల్లో ఉండనున్నారు. ప్రస్తుతం నారాయణపేట ఈఈ కె.బ్రహ్మానంద్​కు కొడంగల్​ ఈఈగా, కరీంనగర్​ డిప్యూటీ సీఈ  కె.రాధాకృష్ణకు కరీంనగర్​ డిప్యూటీ ఎస్ఈగా అదనపు బాధ్యతలను అప్పగించారు.